Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావును వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ గురువారం మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు. ఈ సందర్భంగా వైరా నియోజకవర్గంలో నిర్మించాల్సిన రోడ్లు, చప్టాలు, బ్రిడ్జీలు, మట్టి గురించి కొన్ని ప్రతిపాదనలను అందజేసి నిధులు మంజూరు చేయాలని కోరారు. సింగరేణి మండలంలోని చేమలపాడు నుండి పేరుపల్లి వరకు జూలూరుపాడు మండలంలోని నల్లబండ బోడు అనంతరం వరకు, ఏన్కూరు నుండి వయా కేసుపల్లి మీదుగా పాలకొల్లు వరకు, ఇల్లందు ఆర్అండ్బి రోడ్డు నుండి గిద్దవారిగూడెం వరకు రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపాదనలను ఆమోదించి త్వరితగతిన మంజూరు చేయించాలని కోరారు. అందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సానుకూలంగా స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.