Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు వేదగిరి మురహరి సతీమణి, కుమారుడు గురువారం గంట వ్యవధిలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఒకేరోజు మృతిచెందారు. వేదగిరి నాగమణి, వేదగిరి రమేష్ మృతి పట్ల సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు పుల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, ఎర్ర శ్రీకాంత్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కల్యాణ వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యులు వై.విక్రమ్, తుమ్మ విష్ణు, మెరుగు సత్యనారాయణ, బొంతు రాంబాబు, తాళ్లపల్లి కృష్ణ, హవేలీ కార్యదర్శి దొంగల తిరుపతిరావు సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలిపారు.