Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాచలం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని నల్గొండ జిల్లా డీఐజీ రంగనాధ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దేవస్థానం ఈవో బి.శివాజీ దేవస్థానం తరపున జ్ఞాపికను అందజేయగా అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మెన్ తిరుమలరెడ్డి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఈవో బి.శివాజీ స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో, ఆంజనేయస్వామి ఆలయంలో, లక్ష్మీ తాయారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించి ఆలయం తరపున జ్ఞాపికను అందజేశారు.