Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని
నవతెలంగాణ-భద్రాచలం
విజయ గర్జన సభకు భారీ జన సమీకరణ చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ అన్నారు. భద్రాచలంలోని టీఆర్ఎస్ భవనంలో జరిగిన విజయగర్జన జన సమీకరణ సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. భద్రాచలం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా భద్రాచలం నియోజకవర్గ వాసులకే మంజూరు చేశామని ఆయన పేర్కొన్నారు. యాదాద్రి తరహాలోనే భద్రాచలంలో కూడా అభివృద్ధి పనులు జరుగుతాయని ఆయన అన్నారు. విజయగర్జన సభకు ప్రతి మండలం నుంచి భారీ జన సమీకరణ చేయాలని తెరాస శ్రేణులకు ఆయన సూచించారు. పార్టీ కార్యకర్తలందరూ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు కొండిశెట్టి కృష్ణమూర్తి, కార్యదర్శి రత్నం రమాకాంత్, నర్రా రాము, చిట్టిబాబు, రాంబాబు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.