Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలోని అమరారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న గుదే వెంకటేశ్వర్లు (37) మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతూ శనివారం ఉదయం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీడీఓ శ్రీనివాసులు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. వెంకటేశ్వరరావు అవివాహితుడు. చేతికందిన కొడుకు మరణించడంతో తల్లి ఆదిలక్ష్మి, తండ్రి రాము కన్నీటి పర్యంతమయ్యారు. మంచి భవిష్యత్తు ఉన్న యువకుడు ఈ విధంగా జ్వరంతో చనిపోవడం బాధాకరమని ఎంపీడీవో శ్రీనివాసులు అన్నారు. సెక్రటరీ వెంకటేశ్వర రావు మృతి పట్ల తమ సానుభూతిని తెలియజేసి, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు కలిసి రూ.9 వేల, మణుగూరు మండల పంచాయతీ సెక్రటరీలు రూ.10వేల దహన ఖర్చులకు గాను వెంకటేశ్వరరావు కుటుంబానికి అందజేశారు.