Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల(ఏన్కూర్)
ఏన్కూర్ సీపీఎం మండల కార్యదర్శిగా దొంతబోయిన నాగేశ్వరరావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం మండల పరిధిలోని రేపల్లేవాడ గ్రామంలో జరిగిన ఎనిమిదోవ మండల మహాసభలో తిరిగి రెండోసారి సీపీఎం మండల కార్యదర్శిగా ఎన్నికైనారు. ఉద్యమాల చరిత్ర కలిగిన రేపల్లెవాడ గ్రామానికి చెందిన దొంతబోయిన నాగేశ్వరరావు నవతెలంగాణతో మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడతానని, ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల తీరుపై కలిసొచ్చే పార్టీలతో బలమైన ఉద్యమాలు చేపడతానని తెలిపారు. అదే విధంగా పార్టీ విస్తరణకు కృషి చేస్తానన్నారు.