Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రుపాలెం : జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క సంపూర్ణ యాజమాన్య హక్కు భుక్తంలో ఉన్నటువంటి 6 -7 సర్వే నెంబర్లు అన్యాక్రాంతం అయినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి జగన్మోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. అవి గ్రామ కంఠం భూమి కాదని, దేవాలయ భూములేనని తెలిపారు. ''గ్రామ కంఠం భూములపై ఆలయ అధికారుల పెత్తనం ఏమిటి, గృహాలను తొలగించటానికి మీకేం అధికారం ఉంది'' అని జమలాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మూల్పూరి స్వప్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.