Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఆదివాసీ ఉపాధ్యాయ సంఘం(ఏటీఏ) జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కలం సత్యనారాయణ ఎన్నికయ్యారు. సోమవారం మణుగూరు పట్టణంలో జరిగిన ఏటీఏ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయనను ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఎన్నుకున్నారు. దుమ్ముగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కలం సత్యనారాయణ ఏటిఏ ఉపాధ్యాయ సంఘం బాధ్యుడిగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన నాయకత్వంలో అనేక పోరాటాలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ తన పై నమ్మకంతో ఉన్నత స్థానం కల్పించిందని నిత్యం ఉపాద్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఆయన ఎంపిక పట్ల ఏటిఏ దుమ్ముగూడెం శాఖ మండల అధ్యక్ష కార్యదర్శులు వాసం ఆదినారాయణ. అపకా శంకర్రావు, మట్టా వెంకటేశ్వర్లు, కుంజా రవికుమార్, జగిడి వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు....