Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ కెమోరాలు ఏర్పాటు చేయాలి
- ఆకస్మికంగా పరీక్షా కేంద్రాన్ని
సందర్శించిన కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. 34 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. జిల్లాలో10820 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 9583 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. సుమారు 1237 మంది విద్యార్థులు గౌర్హజరయ్యారు.
సీసీ కెమోరాలు ఏర్పాటు చేయాలి-జిల్లా కలెక్టర్ అనుదీప్
ఇంటర్మీడియల్ పరీక్షా కేంద్రాల్లో సిసి టివిలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. పట్టణంలోని సింగరేణి మహిళా కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రంలో 433 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 19 మంది గైర్హాజరయినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సిసి టివిలు లేనట్లు గమనించిన కలెక్టర్ తక్షణం ఏర్పాటు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ను ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో ఏమైనా ఇబ్బందులుంటే తక్షణం సంబంధిత తహసిల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కరించు విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. జలుబు, జ్వరం, దగ్గు తదితర లక్షణాలున్న విద్యార్ధులను ప్రత్యేక కేంద్రంలో పరీక్షలు రాసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. జ్వరంతో బాధపడుతున్న విద్యార్ధినికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పరీక్షకు ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యారాణి, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.