Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
ఇది వరకైతే ధాన్యాన్ని చేండ్ల దగ్గరనో ఇండ్ల దగ్గరనో ఆరబెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా నల్లని తారు రోడ్లపై, తెల్లని సిమెంట్ రోడ్లపై తీరిగ్గా ఆరబెడుతున్నారు. కారణం ఏదైనా రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టడం మూలంగా వాహన దారుల తిప్పలను ఎవరు పట్టించుకోవడం లేదు. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినప్పుడో! లైటింగ్ సరిగ్గా లేనప్పుడో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అయితే వాహన దారుల అనుభవించే నరకయాతన మాత్రం ఎవ్వరికీ పట్టదంటూ వాహనదారులు వాపోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఇల్లందు, గుండాల ప్రధాన రహదారిపై కూడా మొక్కజొన్నలు ఆరబెడుతుండడంతో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.