Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములకలపల్లి
మండల కేంద్రమైన ములకలపల్లిలో ఎరువులు, పురుగుమందు దుకాణాలను మణుగూరు ఏడీఏ, ఇంటర్నల్ స్క్వాడ్ అధికారి తాతారావు, ఏవో కరుణామయి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో రికార్డులు, బిల్లు బుక్లు, గోడౌన్లను తనిఖీ చేసి డీలర్లకు పలు సూచనలు చేశారు. ధరల పట్టికతో పాటు షాపునకు సంబంధించిన లైసెన్స్ను పరిశీలించారు. ఎమ్మార్పీ ధరలకే పురుగు మందులు, ఎరువులు విక్రయించాలని సూచించారు. సీడ్ మొక్కజొన్న, వరి సాగు చేస్తే రైతులు తప్పకుండా సదరు కంపెనీ నుంచి బాండ్ తీసుకున్నాకే సాగు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి నాగవైష్ణవి, డీలర్లు పాల్గొన్నారు.