Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వ్యవసాయ అధికారి కె .నవీన్ బాబు
నవతెలంగాణ-చండ్రుగొండ
యాసంగిలో వరికి బదులు ప్రత్యేకమైన వంటలు నూనె గింజలు, అపరాలు ఇతర పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయ అధికారి కె నవీన్ బాబు రైతులకు సూచించారు. మంగళవారం చండ్రుగొండలోని రైతు వేదిక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నవీన్ బాబు మాట్లాడుతూ ఫెర్టిలైజర్స్ షాపు వారు వరి విత్తనాలు అమ్మ కూడదని ఆదేశించారు. అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు బోడ విజరు, సాయి భాను, శ్రీ కన్య తదితరులు పాల్గొన్నారు.