Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీసా గ్రామసభలో జిల్లా అడిషనల్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరు మండలం పగిడేరు గ్రామపంచాయతీ పరిధిలో నిర్మించబోయో జియో థర్మల్ ఉత్పత్తి కేంద్రం వలన పరిసర గ్రామ ప్రజలకు గానీ, పర్యావరణ పరంగా గానీ ఎలాంటి హాని జరగదని జిల్లా అడిషనల్ కలెక్టరు కె.వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పీసా గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ శ్రీరాం ఇన్స్టిట్యూట్ ఇండిస్టీయల్ రిసెర్చ్ ( న్యూఢిల్లీ) సంస్థ నిర్మాణం కొరకు తలపెట్టిన జియోథర్మల్ ఉత్పత్తి కేంద్రం పగిడేరులో నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు.పీసా గ్రామసభలో జీఎం జక్కం.రమేష్ మాట్లాడుతూ భారదేశంలో మొట్టమొదటిసారిగా కోటి 70 లక్షల రూపాయాలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో సింగరేణి కాలరీస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టరు ఎన్. శ్రీధర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందన్నారు. 2022 మార్చి నెల వరకు ఉత్పత్తి కేంద్రం పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం మూడు గుంటల భూమి అవసరం నిమిత్తం పీసా చట్టం నిబంధనల ప్రకారం జిల్లా అడిషనల్ కలెక్టరు కె.వెంకటేశ్వర్లు సమక్షంలో ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ,గ్రామపెద్దలు సభ నిర్వహించారన్నారు.ఈ సభలో ఇంఛార్జ్ తహాసీల్దార్ సురేష్, ఎంపిడిఓ వీరబాబు, సర్పంచ్ తాటి.సావిత్రి, ఎంపీటీసి కుంజా కృష్ణకుమారి కార్యదర్శి ,దామల్ల.రేష్మ, ఎంపీఓ పల్నాటి.వెంకటేశ్వరరావు, పీసా సభ్యులు, ఎస్ఓటు జీఎం లలిత్కుమార్, ఏజిఎం సివిల్ వెంకటేశ్వర్లు, డిజియం పర్సనల్ సలగల.రమేష్ పాల్గొన్నారు.