Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
వానాకాలం వరి కోతలు ప్రారంభమయ్యాయని, కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం బీరోలులో మండల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి వడ్లు కొనమని చెప్పడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. భక్త రామదాసు ప్రాజెక్టుతో మండలంలో మెట్ట భూములను వరి సాగుకు యోగ్యంగా మార్చారని, ఇప్పుడు వరి సాగు చేయొద్దు అంటే రైతుల భూములు పడావు పెట్టడమే అన్నారు. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శివర్గ సభ్యులు అంగిరేకుల నరసయ్య, తుళ్లూరు నాగేశ్వరరావు, మండల కమిటీ సభ్యులు గోపోజు రవి, దిండు మంగపతి, శాఖ కార్యదర్శి గుండా దామోదర్ రెడ్డి, కోడి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.