Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఏటీఏ ఉపాధ్యాయ సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శిగా నానమాద్రి సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలో జరిగిన సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ఎన్నికను రాష్ట్ర కమిటీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కొత్తపల్లి బాలుర వసతి గృహంలో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణను సంయుక్త కార్యదర్శితో పాటు, ఐటిడిఏ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఇన్చార్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞలు తెలిపారు. సత్యనారాయణ ఎంపిక పట్ల ఏటిఏ మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసం ఆదినారాయణ, అపకా శంకర్ రావు, కలం సత్యనారాయణ, కల్లూరి బొర్రయ్య, మట్టా వెంకటేశ్వర్లు, రమేష్, జగిడి వెంకటేశ్వర్లు, వసంతరావు, రాంబాబు లు హర్షం ప్రకటించిన వారిలో ఉన్నారు.