Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
మండల పరిధిలోని పోలేపల్లి రెవెన్యూలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న రాజీవ్ స్వగృహ ఇళ్ల సముదాయాన్ని గురువారం జిల్లా కలెక్టర్ గౌతమ్ సందర్శించారు. ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఇళ్ల సముదాయన్ని పరిశీలించారు.కార్యక్రమంలో డీఆర్వో శిరీష, ఆర్డీవో రవీంద్రనాథ్, ఉప తహసీల్దారు కరుణశ్రీ, ఆర్ఐ లు నరేశ్, ప్రవీణ్, గుత్తేదారు గరికపాటి (ఆర్టీస్)వెంకటేశ్వరరావు, హౌజింగ్,రోడ్లు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.