Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
నూతన బస్టాండ్ నిర్మాణ అవకతవకలపై లోకాయుక్త విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ కోసం మంగళవారం లోకాయుక్త ముందు సీపీఎం జిల్లా నాయకులు వై.విక్రమ్ హాజరయ్యారు. పిటిషన్ పరిశీలించి న లోకాయుక్త జస్టిస్ వచ్చే నెల 20కు తిరిగి వాయిదా వేశారు. తొలుత ఖమ్మం నగరంలో ఎంతో గొప్పగా, ఆర్భాటంగా నిర్మించిన నూతన బస్టాండ్ నిర్మాణ అవకతవకలు, నాసిరకం పనులపై వేసిన పిటిషన్పై విచారణ నిమిత్తం మంగళవారం హైదరాబాద్ బషీర్ బాగ్ తెలంగాణ గౌరవ లోకాయుక్త ముందు ఖమ్మం సీపీఎం నేతలు వై విక్రమ్, జె వెంకన్న బాబు హాజరై తమ వాదనలు వినిపించారు. వాదనలు విన్న లోకాయుక్త తదుపరి విచారణ నిమిత్తం డిసెంబర్ 20కు వాయిదా వేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో పార్టీ జిల్లా నాయకులు వై విక్రమ్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడైనా ఆర్టిసి అధికారులు కళ్ళు తెరిచి బస్టాండ్ నాసిరకం పనులతో అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్పై, వారికి సహకరించిన కింద స్థాయి అధికారులపై చర్యలు తీసుకొని ప్రజల సొమ్మును ప్రభుత్వానికి రికవరీ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.