Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా ఏక కాలంలో అమలు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి(కెవిపియస్) రాష్ట్ర కమిటీ సభ్యులు కొమ్ము శ్రీను అన్నారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కెవిపియస్ మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ కారుమంచి శ్రీనివాస్ రావుకు అందజేశారు. కార్యక్రమంలో కెవిపియస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు కుక్కల సైదులు, పాపిట్ల సత్యనారాయణ, మండల నాయకులు నూకల బాలరాజు, నందిపాటి లక్ష్మయ్య, పుట్ట ప్రసాద్, దర్శి నాగేశ్వరరావు, పొన్నెకంటి అనిష్, శ్రీను, నాగేశ్వరరావు, కస్థలా సురేష్, చింత శ్రీను, వీరబాబు, వెంకటేశం, హుస్సేన్, నాగయ్య, రామనాధం పాల్గొన్నారు.