Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని కప్పలబందం గ్రామానికి చెందిన కర్నాటి పిచ్చి రెడ్డి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉన్నారు. కుమార్తె వచ్చే వరకు మమత ఆసుపత్రిలో శవన్ని భద్రాపరిచారు. ఆదివారం కుమార్తె రావటంతో అత్యక్రియ్యలు కోసం కల్లూరు తరలించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వచ్చి భౌతికయాన్ని సందర్శించి నివాళి ఆర్పించారు. మృతుని భార్య బంధువులకి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి ప్రతినిధులు డా,, లక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, యూత్ మండల అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ, లోకారం సర్పంచ్ కళ్యాణపు కొండలరావు పాల్గొన్నారు.