Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరంలోని పెవిలియన్ గ్రౌండ్ ను ఆదివారం నగర మేయర్ పునుకొల్లు నీరజ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మైదానంలో వాకర్స్తో కలసి వాకింగ్ చేశారు. వారి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా వాష్ రూం, నీటి వసతి, ప్రత్యేక లైట్లు, అలాగే పోలీస్ శిక్షణ కు సిద్ధం అవుతున్న క్రీడాకారులకు గ్రౌండ్లో పిట్ ల ఏర్పాటు, అందులో ఇసుక ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే షటిల్ క్రీడాకారుల సమస్యలను తెలుసుకొని వాటిని త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ బుడగం శ్రీనివాస్, 52వ డివిజన్ కార్పొరేటర్ బుర్రి వెంకన్న, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, పెవిలియన్ వాకర్స్ కమిటీ అధ్యక్షులు ముత్తయ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్రెడ్డి, ఆర్గనైసింగ్ సెక్రటరీ రాకం శ్యామ్ బాబు, కోటయ్య, గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.