Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కథనానికి స్పందన
నవతెలంగాణ -చర్ల
''ఎర్రం పాడు గొంతెండుతోంది'' అనే శీర్షికన సోమవారం నవతెలంగాణలో ప్రచురితమైన కథనానికి మిషన్ భగీరథ ఉన్నతాధికారులు స్పందించారు. వెంటనే ఎర్రపాడు ఆదివాసీ గ్రామంలో మరమ్మతులకు గురైన విద్యుత్ మోటార్ను మరమ్మతు చేయించారు. మూడు నెలలుగా మా ఆదివాసీల గోడు వినని అధికారులు నవతెలంగాణ పేపర్ లో వచ్చినా వార్తకు స్పందించారని ఆ గ్రామ యువత పత్రికకు ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జూనియర్ ఇంజనీర్ రాము నవతెలంగాణతో మాట్లాడుతూ సోలార్ సిస్టం ఏర్పాటు చేసిన గుత్తేదారు జాప్యం చేయడం వలన ఆ గ్రామంలో తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఆ గుత్తేదారుపై తగు చర్యలు చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఏదేమైనప్పటికినీ ఉన్నతాధికారులు చొరవ చూపడం వల్ల ఎర్రం పాడులో తాగునీటి సమస్య తీరి చెరువు నీరు తాగే దుస్థితి నుండి ఆ గిరిజనులు సాగు నీరు తాగే అవకాశం ఏర్పడింది.