Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
గ్రామపంచాయతీ కార్మికులకు పిఆర్సిని తక్షణమే అమలు చేయాలని సీఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొండపల్లి శ్రీధర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎండిఓ కార్యాలయం నందు ధర్నా నిర్వహించి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం ఎంపీడీవో కి అందజేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ కార్మికులకు మల్టీ పర్పస్ విధానం రద్దు చేస్తూ పర్మినెంట్ చేయాలని అన్నారు. వీరికి వచ్చే జీతంతో కుటుంబాన్ని నెట్టుకు రావడం కష్టంగా ఉందని అన్నారు. నైజాం కాలంనాటి నిరంకుశ విధానాలను నేటి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 20న జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కే.కాంతారావు, కే.సీతారాములు, బి.నవీన్ పాల్గొన్నారు.