Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మధిర
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని భరత్ విద్యా సంస్థలలో గురువారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత శీలం వెంకటరెడ్డి పాల్గొని విద్యార్థులు ఏర్పాటు చేసిన క్రిస్మస్ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జింకల కోటేశ్వరరావు, కటికల రవీందర్ రెడ్డి, నాగరాజు, అజిమ్, భవాని, పావని, త్రివేణి, ప్రియాంక, స్రవంతి, రాజ్యలక్ష్మి, రాము, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.