Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
ఆళ్ళపల్లి మండలం బోడాయికుంట గ్రామానికి చెందిన కొమరం నవీన్ (18) యువకుడు ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఆదివారం బోడాయికుంట గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మేడారం మొక్కు తీర్చుకోవడానికి నవీన్తో పాటు తన కుటుంబ సభ్యులు ట్రాక్టర్లో శనివారం రాత్రి పూట వెళ్ళారు. ఈ క్రమంలో రాత్రి పూట ట్రాక్టర్ లైట్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఇంజన్పై కూర్చున్న నవీన్ ట్రాక్టర్ కింద పడి, తీవ్ర గాయాలవడంతో ఘటనా స్థలం వద్దే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నవీన్ కుటుంబ సభ్యులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని తెలిపారు. కుటుంబ సభ్యులు నవీన్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఆదివారం ఉదయం ఖననం చేశారు.