Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ వీపీ గౌతమ్ను కోరిన
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఫారెస్టు, రెవెన్యూ పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు.జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్ ఆధ్వర్యంలో ఫారెస్టు, రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాలలోని ఫారెస్టు, రెవెన్యూ మధ్య ఉన్న భూ సమస్యలను పరిష్కరించాలన్మారు. రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పించాలని కోరారు. సత్తుపల్లిలో 35 ఎకరాల డీ ఫారెస్ట్ భూమిని మున్సిపాలిటీ పరిధిలోని నిరు పేద ప్రజల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యంను సత్వరం కొనుగోలు చేయాలని కోరారు. సత్తుపల్లి నియోజకవర్గంలోని ధాన్యాన్ని లోకల్ మిల్లర్లకు కేటాయించే విధంగా చూడాలని కోరారు.