Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
కల్తీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి పంటల సాగును చేపట్టాలని మండల వ్యవసాయ అధికారి మందుల రాధ అన్నారు. మండల పరిధిలో బాణాపురం రైతు వేదికలో ఎరువుల దుకాణాలుదారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈసమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వచ్చే వానాకాలం వ్యవసాయ సాగులో పురుగు మందుల దుకాణదారులు కల్తీ విత్తనాలు, మందులు విక్రయిస్తే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామన్నారు.కార్యక్రమంలో ఎస్సై తోట నాగరాజు,ఏఈఓ వి వంశి,రైతు సమన్వయ సమితి సభ్యులు,పురుగుమందు దుకాణదారులు పాల్గొన్నారు.