Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మొదటి రోజు పలు పతకాలు సొంతం
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ శనివారం తెలిపారు. హైదరాబాద్, జీఎంసీ బలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో ఈ నెల 14, 15 తేదీలలో జరగుతున్న తెలంగాణ రాష్ట్ర సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో జిల్లా అథ్లెట్లు 15 మంది పాల్గొన్నారు. మొదటి రోజు 8 పతకాలు సాధించారు. కొత్తగుడెంకు చెందిన ఎస్కే.రియాజ్ పాషా డిస్కస్ త్రో లో బంగారు పతకం, షాట్ పుట్ త్రో లో కాంశ్య పతకం, రుద్రంపూర్కు చెందిన పిఎస్.అభిలాష్ 200 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, భద్రచలంకు చెందిన వాసం రాజు 800 మీటర్ల పరుగు పందెంలో బంగారు పతకం, కొత్తగుడెంకు చెందిన సాయి భావన లాంగ్ జంపులో బంగారు పతకం, ఇల్లందుకు చెందిన మంజుల హై జంపులో బంగారు పతకం, లాంగ్ జంపులో కాంశ్య పతకం, 4 ఇంటూ100 మీటర్ల రిలేలో రాజు, అభిలష, వంశీ, మనోజ్ కాంశ్య పతకం సాధించరాని తెలిపారు. ఈ సందర్భంగా పతకాలు సాదించిన అథ్లెట్ను కోచ్లు డి.మల్లికార్జున, పి.నాగేందర్, శివ, శ్రీనివాస్లను అభినందించారు.