Authorization
Mon April 14, 2025 09:52:10 am
- ఎమ్మెల్యే రాములు నాయక్
నవతెలంగాణ-జూలూరుపాడు
దేశానికి ఆదర్శంగా రాష్ట్ర సంక్షేమ పథకాలు ఉన్నాయని వైరా శాసనసభ్యులు లావుడియా రాములు నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు, వికలాంగులకు, వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్ మరి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని అన్నారు. మళ్లీ మూడోసారి కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చౌడం నరసింహారావు, ఎంపీపీ లావుడియా సోనీ, గిరిబాబు, మండల ప్రధాన కార్యదర్శి నున్నా రంగారావు, ఎంపీటీసీ పెండ్యాల రాజశేఖర్, సర్పంచు సావిత్రి, నాయకులు రామకృష్ణ, రాంబాబు, కృష్ణ, ప్రసాద్, నరసింహారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.