Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును హైదరాబాద్లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసినట్లు టీడీపీ మహబూబా బాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యాదర్శి, గుండాల ఎంపీటీసీ షేక్ సంధాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పినపాక నియోజకవర్గ పరిస్థితులను చంద్రబాబుకు వివరించినట్టు తెలిపారు. నియోజకవర్గంలో కార్యాకర్తలు బలంగా ఉన్నా నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలిపానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పినపాక నియోజకవర్గంలో టీడీపీ పోటీ విషయంలో ఆయన ఆరా తీసారని, పలువురు నేతల పేర్లు చర్చకు వచ్చినట్లు తెలిపారు.