Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న దమ్మపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, దమ్మపేట సొసైటీ వైస్ చైర్మన్ నాయుడు చెన్నారావుని శుక్రవారం అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నాయుడు చెన్నారావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఆరోగ్య స్థితిగతులు తెలుసుకొని డాక్టర్ల సలహాలు పాటించాలని, దేనికి అధైర్య పడవద్దని ధైర్యం చెప్పారు. పరామర్శించిన వారిలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్ రావు జోగేశ్వరరావు, ఉప సర్పంచ్ ధారాయుగంధర్, పలువురు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.