Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
రాష్ట్ర ప్రభుత్వం విద్యా సౌకర్యాలు పెంచుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని సత్తుపల్లి శాసన సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ఆదివారం జోనల్ క్రీడలను సండ్ర, లింగాల కమల్ రాజు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులుకు విద్యార్థులు ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ గతంలో ఆ హాస్టల్స్లో అన్నం కూడా సరిగ్గా పెట్టేవారు కాదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యకు ప్రాధాన్యత ఇస్తూ గురుకులాలను ఆభివృద్ధి చేసారన్నారు. ఈ సందర్భంగా జోనల్ గేమ్స్ కు విరాళంగా సండ్ర 25 వేలు, జెడ్పీ చైర్మన్, ఎంపీపీ, జెడ్పీటీసీలు పదివేలు చొప్పున అందించారు. ఈ సందర్భంగా ఆర్సిఒ ప్రత్యూష మాట్లాడుతూ 27వ వరకు పోటీలో ఖమ్మం ఉమ్మడి జిల్లాలలోని 14 సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలకు చెందిన 1190 మంది క్రీడాకారులకు పాల్గొంటారన్నారు. న్యూ జోన్ 4, బి స్థాయిలో క్రీడలు పోటీలు క్రీడలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, హ్యాండ్ బాల్, బ్యాట్మెంటన్, చెస్, క్యారమ్స్, అథ్లటిక్స్, అండర్ 19, 17, 14 వీటితో పాటు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిరవల్లి.రఘు, జెడ్పీటీసీ కట్టా. అజయకుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు ఎండీ.ఇస్మాయిల్, రైతు సమితి మండల జిల్లా ప్రతినిధులు లక్కినేని రఘు, పసుమర్తి .చంద్రరావు, తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్, ఎంపీఈవో వీరస్వామి, ప్రిన్సిపాల్ శ్రీలత, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.