Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాద్రి బ్రాహ్మణ పురోహిత సంఘం ఎన్నికలు బుధవారం భద్రాచలంలో నిర్వహించారు. అధ్యక్షులుగా రామావజుల రవికుమార్ శర్మను మరోమారు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1991 నుంచి 30 సంవత్సరాలకు పైగా రామావజులు రవికుమార్ బ్రాహ్మణ పురోహిత సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఉపాధ్యక్షులుగా ఎం.వేణుగోపాల చార్యులు, ఎస్.రాజేశ్వర శర్మ, బి.పవన్ కుమార్ శర్మ, ప్రధాన కార్యదర్శిగా ఆర్ పుల్లయ్య, కోశాధికారిగా ప్రతాపం నరసింహ చార్యులు, సహాయ కార్యదర్శిగా ఆర్ వి శ్రీనివాస్ శర్మ, సంయుక్త కార్యదర్శిగా ఎం.రామాచార్యులు, ప్రచార కార్యదర్శిగా బుక్కపట్నం రామాచార్యులు, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా భాస్కరన్ సత్యప్రసాద్ శర్మ, కార్యవర్గ సభ్యులుగా కంజర్ల విజరు కుమార్, కొవ్వూరి కేదార్ నాథ్, కాకరాల శ్రీనివాస శర్మ, ఎస్ శేషాచార్యులు, కదంబరి కృష్ణ శర్మ, గౌరవ సలహాదారులుగా ఇంగువ రామకృష్ణ శాస్త్రి, బొల్లికుంట శ్రీనివాసచార్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.