Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రోజు ఉద్రిక్తిత...
నవతెలంగాణ-అశ్వారావుపేట
వాగొడ్డుగూడెంలో మూడో రోజు ఉద్రిక్తిత నెలకొంది. పోడు సాగు దారులు, అటవీ సిబ్బంది పరస్పరం దాడులు చేసుకు న్నారు. ఇందులో ఒక మహిళ అపస్మారకినికి లోనైంది. వెంటనే అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం కోలుకుంది. అటవి సిబ్బంది స్వల్ప గాయాలు అయ్యాయి. శుక్రవారం ఉదయమే పోడు సాగు దారులు నాగళ్ళు తో దుక్కి చేస్తూ విత్తనాలు నాటుతున్నారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ రహ్మాన్ తన సిబ్బందితో చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ సమాచారంతో సీఐ బాలక్రిష్ణ ఇరువర్గాలుతో శాంతింప జేశారు. అనంతరం సీఐ బాలక్రిష్ణ సీపీఐ(ఎం) నాయకులు అర్జున్, చిరంజీవి, మురళీతో సమావేశం అయి పోడు వివాదంపై చర్చించారు. వైఎస్ఆర్ సీపీ జిల్లా నాయకులు మడకం ప్రసాద్, పెనుబల్లీ రమేష్లు వాగొడ్డుగూడెం వెళ్ళి పోడు సాగు దారులకు సంఘీభావం తెలిపారు.