Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్క్యులర్ను విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో కరోనాతో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్ కార్మికుల మాదిరిగా రూ.15 లక్షల ప్రత్యేక ఎక్స్గ్రేషియో చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో చేసిన నిరవధిక సమ్మె పలితంగా సింగరేణి యాజమాన్యం శనివారం సర్క్యూలర్ విడుదల చేసిందని, దాని ప్రకారం 2020 మార్చి తర్వాత కరోనా వల్ల మరణించిన కాంట్రాక్టు కార్మికులకు రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లిస్తారని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. శనివారం కొత్తగూడెం ఏరియాలోని ఆర్సిహెచ్పి వద్ద కాంట్రాక్ట్ కార్మికులతో జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ నెల 26వ తేదీన యాజమాన్యంతో డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో జరిగిన అగ్రిమెంట్లోని విషయాలను వివరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జరిగిన అగ్రిమెంట్ ప్రకారం యాజమాన్యం కరోనా మరణానికి రూ.15 లక్షల ప్రత్యేక సర్క్యులర్ను విడుదల చేసిందని, దాని ప్రకారం సరైన ఆధారాలతో స్థానిక ఏరియా అధికారులకు సమర్పించాలని దాని ఆధారంగా ఎక్స్గ్రేషియా చెక్కును నామినీ ఉన్న వ్యక్తులకు బ్యాంకు ఖాతాలో జమచేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్య, ఇనుపనూరి నాగేశ్వరరావు, కిషోర్, బి.వీరు, బోలా సింగ్, శ్రీను, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.