Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
డిసెంబర్ 26, 27, 28 తేదీల్లో హైదరాబాదులో జరుగుతున్న ఎన్పిఆర్డి అఖిలభారత మూడవ మహాసభలను జయప్రదం చేయాలని ఎన్పిఆర్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్ పిలుపునిచ్చారు. గురువారం ఖమ్మంలోని మంచికంటి నగర్ భవనంలో ఎన్పిఆర్డి జిల్లా అధ్యక్షులు డోనుమాన్ నాగరాజు అధ్యక్షతన సదస్సు జరిగినది. ఈ సదస్సులో అయన మాట్లాడుతూ వికలాంగుల సమస్యలపై ఉద్యమాలు చేసి విజయాలు సాధించిన సంఘం ఎన్పిఆర్డి అని అన్నారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో జిల్లావ్యాప్తంగా వికలాంగుల సమస్యలపై పరిష్కారం కోసం ఉద్యమాలు చేసిందన్నారు. జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ వికలాంగుల వినియోగించే పరికరాలపై జిఎస్టి విధించిన ఏకైక ప్రభుత్వం బిజెపి అని అన్నారు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ను నెల నెల ఇవ్వడం లేదన్నారు. సదస్సులో ఎన్పిఆర్డి జిల్లా నాయకులు సిరికొండ ఉపేందర్, కనకాంబరం, కృష్ణయ్య, యాకోబ్, జగదీష్, అరుణ్ కుమార్, శ్రీను, సుభద్ర, లక్ష్మీదేవి, లక్ష్మణ్ పాల్గొన్నారు.