Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-పాల్వంచ
సాగులో ఉన్న ప్రతీ పోడు సాగుదారునికి హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని లారీ అసోసియేషన్ హాల్లో సీపీఐ(ఎం) జిల్లా విస్తృతస్థాయి సమావేశం కొక్కెరపాటి పుల్లయ్య కారం పుల్లయ్యల అధ్యక్షతన జరిగింది. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో తమ్మినేని మాట్లాడుతూ ఇటీవల చండ్రుగొండలో ఫారెస్ట్ అధికారిపై జరిగిన దాడిని ఆసరా చేసుకొని గొత్తి కోయలు సాగు చేసుకుంటున్న భూమి సర్వే నిలిపివేయడం సరైనది కాదని అన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి పోడు సమస్యను పరిష్కారం చేయకపోవడం వలన ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఒక్క ఘటన ఆధారంగా మొత్తం గోత్తి కోయలకు అన్యాయం చేయడం సరికాదని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రజల తరఫున భవిష్యత్తు పోరాటాలకు కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు బి.వెంకట్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, సీనియర్ నాయకులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, మందలపు జ్యోతి, నర్సారెడ్డి, లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, కొండపల్లి శ్రీధర్, కున్సోత్ ధర్మ, దొడ్డ రవి,యస్ ఏ నభి, పిట్టల అర్జున్, ఎలమంచిలి వంశీ, చిలకమ్మా, వీర్ల రమేష్, గద్దల శ్రీను, భూక్య రమేష్, నిమ్మల వెంకన్న, యసా నరేష్ తదితరులు పాల్గొన్నారు.