Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విలియం కింగ్ విగ్రహానికి నివాళులు అర్పించిన జీఎం
- జండా ఆవిష్కరణలు : స్టాల్స్ ప్రారంభం
నవతెలంగాణ-ఇల్లందు
సింగరేణి దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వివిధ గనుల, విభాగాలలో పతాక ఆవిస్కరణ చేసారు. జీఎం కార్యాలయంలో సింగరేణి వ్యవస్థాపకుడు డా.విలియం కింగ్ విగ్రహానికి జీఎం ఎం.షాలెంరాజు పూలమాల వేసారు. సింగరేణి జెండాను ఆవిష్కరించారు. మొట్టమొదటి గని కొత్తపూసపల్లి గ్రామంలో సింగరేణి పతాక ఆవిస్కరణ చేసి గ్రామా ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సింగరేణి హైస్కూల్ గ్రౌండ్ జేకె ఏరియా ఇల్లందు నందు ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్లను జీఎం, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్, సేవ అధ్యక్షురాలు జి.మధురవాణి తదితరులు ప్రారంబించారు. జీఎం, ఎమ్మెల్యే, అధికారుల సంఘం అధ్యక్షుడు పంజాల శ్రీనివాసు, సేవ అద్యక్షురాలు జి.మధురవాణి, గుర్తింపు సంఘం నాయకులూ ఎస్.రంగనాధం జ్యోతి ప్రజ్వలన చేసి, సింగరేణి దినోత్సవం కేక్ కట్ చేసి బాణాసంచా పేల్చారు. ఈ సందర్బముగా జీఎం మాట్లాడుతూ సింగరేణికి పుట్టినిల్లు అయిన ఇల్లందులో ప్రతి సంవత్సరం సింగరేణి దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుతోందని అదేవిధంగా ఏరియాకు నిర్దేసించిన ఉత్పత్తిని సాధించాలని అన్నారు. హాజరైన కార్మికులకు వారి కుటుంబ సబ్యులకు సింగరేణి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇల్లందు ఏరియా అభివృద్ధికి సింగరేణి చేయుతనిస్తుందని పూర్వవైభవం కోసం కృషి చేస్తానని, అలాగే నూతన బొగ్గు బావులను తీయాలని యాజమాన్యానికి సూచించారు. ఈ సందర్బముగా సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మిమిక్రి, సీత ప్రసాద్ బృందం చే వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించారు. ఉత్తమ కార్మికులకు, అధికారులకు సన్మానం, ఉత్తమ గృహలంకరణ గృహాలకు, మహిళలకు వివిధరకాల ఆటల పోటీలు, దీపాలంకరణ, ఇతర పోటిలలో గెలుపొందిన వారికీ బహుమతి ప్రదానం చేసారు. ఈ సందర్బముగా ఏర్పాటుచేసిన వివిధ రకాల స్టాల్స్లను కార్మికులు పట్టణ ప్రజలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో యస్వోటు జియం.మల్లారపు మల్లయ్య, అధికారుల సంఘం అద్యక్షుడు శ్రీనివాసు, ప్రాజెక్ట్ అధికారులు బొల్లం వెంకటేశ్వర్లు, డీజీఎం (పర్సనల్) జీవి.మోహనరావు, గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు ఎస్.రంగనాధం, ఏజీఎం (ఇఅండ్యం)ప్రభాకరరావు, ఎజియం(ఐఈడీ)గిరిధరరావు, సివిల్అధికారి డి.ఆదినారాయణ, అధికారులు నరసింహారావు, వెంకటరామచంద్ర, యుసూబ్, అంజిరెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ శ్రీహరి, కృష్ణ, ఉన్నతాధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.