Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెనుబల్లి
నూతనంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన చలమాల విట్టల్ రావుకు సోమవారం ఘనంగా పౌర సన్మానం లభించింది. విఎం బంజర్లోని రింగ్ సెంటర్లో వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేముల నరసింహారావు, వంగగిరిజపతి, పొట్లపల్లి వెంకటేశ్వరరావు, తాండ్ర రాజేశ్వరరావు, నాగ ప్రసాద్, కొప్పుల గోవిందరావు, మిద్దె స్వామి, మల్లెల శ్రీనివాసరావు, అన్నపురె లక్ష్మయ్య, బెజవాడ సాయి శేషు, టాక్సీ అసోసియేషన్ అధ్యక్షులు భూషణం, బజ్జూర్ నాగేశ్వరరావు, మల్లెల రాజా, పాల్గొన్నారు.