Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటాలు కొనసాగించడమే కామ్రేడ్ చల్లా వెంకన్నకు ఇచ్చే నిజమైన నివాళి అని సీఐటీయూ సీనియర్ నాయకులు కొడిశాల రాములు, నెల్లూరి నాగేశ్వరరావులు అన్నారు. మంగళవారం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో సీఐటీయూ నాయకులు చల్లా వెంకన్న ద్వితీయ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కన్వీనర్ ఉప్పుతల నరసింహారావు వెంకన్న చిత్రపటానికి పూలమాల వేశారు. కొడిశాల రాములు జెండా ఆవిష్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక విధానాల కారణంగా కార్మికుల జీవితాలు చితికి పోతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రంగా దొడ్డి శంకరయ్య, వెంకటేశ్వర్లు, చల్లా వెంకన్న సతీమణి ఎల్లమ్మ, వై.నాగలక్ష్మి, సదానందం తదితరులు పాల్గొన్నారు.