Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
గత 22 మాసాలుగా ఔట్సోర్సింగ్ వర్కర్లకు, డైలీ వేజ్కు 8నెలల వేతన బకాయిలు ఇప్పించాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఆదివారం ఖాళీ కంచాలతో ధర్నా నిర్వహించారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ మండల కన్వీనర్లు అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణలు మాట్లాడారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ పీఎంహెచ్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న పని చేస్తున్న డైలీ వేజ్ ఔట్సోర్సింగ్ వర్కర్లకు పెండింగ్లో ఉన్నాయని పెంచిన పీఆర్సీ వేతనాలు అమలు చేయడం లేదని అన్నారు. పిఎఫ్లో ఉన్న అవకతవకల్ని సరి చేయడం లేదని 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం లేదని గత ఏడు మాసాలుగా అనేక పర్యాయాలు ఐటీడీఏ పీవో, కమిషనర్ గిరిజన సంక్షేమ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా గాని సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఈ తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్రంలోని గిరిజన నియోజక వర్గ కేంద్రాలలో ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు సమర్పించి వారిద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. పాయం ముత్తయ్య అధ్యక్షతన జరిగిన సభలో ఈ కార్యక్రమంలో ఈసం పద్మ, జయా, అంజమ్మ, సుబ్రమణ్యం, సమ్మక్క, సుగుణ, సుశీల, లక్ష్మీ, రాజమ్మ, రమ, రజిత, రమని జనకి, లక్ష్మణ్ పాసి తదితరులు పాల్గొన్నారు.