Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పినపాక మండలంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తాసిల్దార్ ప్రసాద్ను ఎంపీపీ గుమ్మడి గాంధీ, పినపాక మండల సర్పంచులు, ఎంపీటీసీలు కలిసి మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెవెన్యూ పరంగా ప్రజలకు చక్కని పరిపాలన అందించాలని తహసిల్దార్ను కోరారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సలహాలు సూచనలతో ముందుకు సాగుతామని తహసీల్దార్ ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు శేఖర్, హరీష్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు నరసింహారావు, గోగ్గల నాగేశ్వరరావు, సునీల్, కృష్ణంరాజు, నాగభూషణం, మహేష్, శివశంకర్, సుధాకర్, తొలెం కల్యాణి, సత్యవతి, కే.శ్రీలత, రాధాబాయి, సుజాత, సుశీల, ఈసం భవతి, లక్ష్మీ రూపవతి, తదితరులు పాల్గొన్నారు.