Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
పేరువంచ గ్రామంలో గ్రామస్తుల సహకారంతో నిర్మించిన శ్రీసీతారామాంజనేయ దేవాలయానికి 6.70లక్షల విరాళాన్ని దాతలు ఆదివారం ఆలయ కమిటీకి అందజేశారు. గ్రామానికి చెందిన కొండపల్లి రాధాకృష్ణారావు, కొండపల్లి కేశవరావు, కొండపల్లి రత్నాకర్లు కలిసి 6.70లక్షల రూపాయాల విరాళం చెక్కును ఆలయ కమిటీ చైర్మన్ యరమల రంగారెడ్డి, వైస్ చైర్మన్ మణుగూరి ప్రభాకర్రెడ్డి, కీసర సత్యనారాయణరెడ్డి, అంకిరెడ్డి కృష్ణారెడ్డి, పరిమి వెంకటేశ్వర్లు, కీసర సత్యనారాయణ రెడ్డికి అందజేశారు.