Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కామేపల్లి : పంచాయతీ ఎన్నికల మొదటి విడతలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్టు కామేపల్లి, కారేపల్లి మండలాల రూరల్ సీఐ సాంబరాజు తెలిపారు. మండల పరిధిలోని పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో ఎన్నికల నిర్వహణకు అడిషనల్ ఎస్టీ ఒకరు, డీఎస్పీ ఒకరు, ఆరుగురు సీఐలు, 8మంది ఎస్సైలు ఆర్ముడ్ పోలీస్ సిబ్బంది 170మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.