Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దమ్మపేట : 5 సంవత్సరాలుగా దమ్మపేట గ్రామ పంచాయతీని బ్రష్టుపట్టించి.. కనీసం ప్రజలకు మౌలిక వసతులు ఏర్పాటులో విఫలం చెందిన టీఆర్ఎస్ పాలనను బేరీజు వేసుకుని కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్ బలపర్చిన కూటమి దమ్మపేట సర్పంచ్ అభ్యర్థి ఉయ్యాల లక్ష్మీనారాయణతోపాటు 14 వార్డుల సభ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం దమ్మపేటలో జరిగిన కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుచెప్పి ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసి పార్టీలు మారే అభ్యర్థులు తమ కూటమిలో లేరని స్పష్టం చేశారు. అధికార పార్టీ నాయకులు పెన్షన్లు రావని, అభివృద్ధి కార్యక్రమాలు జరగవని ప్రజలను అసత్య ప్రచారాలతో మభ్యపెట్టడానికి చూస్తూ ఉన్నారని, అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం కలిగినా తాను సహించబోనని ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందే విధంగా తాను నిరంతరం పోరాడతానని, శాసనసభ్యుడిగా తనకు హక్కుగా సంక్రమించిన అభివృద్ధి పరమైన నిధుల కోసం అసెంబ్లీలో సైతం పోరాడి నిధులు తీసుకువస్తానని ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్తులూరి వెంకటరామారావు, ఎంఏ కబీర్, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు నాయుడు చెన్నారావు, గడ్డిపాటి సత్యం, సీపీఐ(ఎం) నాయకుడు బోగిం నరసింహారావు, కొనుసోతు పద్మ, టీజేఎస్ నాయకులు బందం చెన్నారావు, బంధం శ్రీనివాసరావు, బొగిం సత్యం, సుధాపల్లి నాగరాజు, యం.డి. వలీపాషా, కండవల్లి రాజేశ్వరరావు, నాయుడు వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.