Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
పంచాయతీ పోరులో పల్లెల్లో మద్యం ఏరులై పారింది. గ్రామాల్లో సర్పంచి పదవిని కీలకంగా భావిస్తున్న ఆశావహులు మద్యం, డబ్బుల పంపిణీతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తు న్నారు. వారికి కావా ల్సిన మద్యాన్ని సరఫ రా చేస్తూ వారి ఓట్లను సాధించేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు పోటాపోటీగా దావత్(విందు)లు ఏర్పాటు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం సాగిస్తున్నారు. ఎలాగైనా పదవి దక్కించుకోవాలనే తపనతో కొన్ని చోట్ల తమకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం చేయించుకుంటున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు నిషేదించినప్పటికీ, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతగా దష్టిసారించకపోవడంతో మండలం లోని అనేక గ్రామాలు మద్యం మత్తులో మునిగితేలుతున్నాయి. కొన్ని చోట్ల ఓటర్లను ప్రలోభపెట్టడానికి డబ్బుల పంపిణీ కూడా జరిగింది. ఫిర్యాదు చేస్తేనే తప్ప అధికారులు దష్టి సారించిన పాపాన పోలేదు. మండలంలో ఆదివారం మద్యం, డబ్బుల పంపిణీ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు సమాచారం.
ఇంటికో కోడి, ఓటుకు వెయ్యి...
మండలంలోని నేడు సర్పంచ్ ఎన్నికలకు పోలింగ్ జరుతున్నందున ఆదివారం ముఖ్యంగా జనరల్ స్ధానాలల్లో ఇంటికో కోడి, ఓటుకు రూ.1000లు, మహిళలకు సీతల పానియాలతో ఇచ్చి ఓటర్లును ప్రభావితం చేసినట్టు సమాచారం. మండలంలో 41 గ్రామపంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా 38 గ్రామ సర్పంచ్లకు, 364 వార్డులకు సోమవారం పోలింగ్ జరుగుతోంది.