Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందరి సహకారంతో సమర్థవంతంగా విధులు
- జిల్లా పరిషత్ సీఈవో డి.శిరీష
నవతెలంగాణ - ఖమ్మంటౌన్
నిధులలేమి కారణంగా జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు సమావేశాల్లో లేవనెత్తుతున్న సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించగలిగే పరిస్థితి లేకుండా పోయిందని జిల్లా పరిషత్ సీఈవో డి.శిరీష పేర్కొన్నారు. గార్ల ఎంపీడీఓగా, జెడ్పీ డిప్యూటీ సీఈవోగా, చివరికి సీఈవోగా బాధ్యతలు మోస్తున్న ఆమెతో 'నవ తెలంగాణ' ముఖాముఖి విశేషాలివి.
నిధుల వినియోగం ఎలా ఉంది.?
కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లా పరిషత్లకు రావాల్సిన నిధులు చాలా కాలంగా నిలిచిపో యాయి. 14 ఫైనాన్స్ నిధులు సైతం రావడం లేదు. దీంతో ఇప్పుడు కేంద్రం నుంచి ఒక్క రూపా యి కూడా జెడ్పీల అభివృద్ధికి రావడం లేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అరకొర నిధులే విడుదలవుతున్నాయి. వస్తున్న కొద్ది పాటి నిధులనే కేటగిరీల వారీగా విభజించి అందరినీ సమానంగా సంతృప్తి పరచాల్సి వస్తుంది. దీంతో సభ్యులు తీసుకొస్తున్న సమస్యలను పరిష్కరిం చలేని దుస్థితి నెలకొంది.
బీఆర్జీఎఫ్ నిధుల మాటేమిటి.?
బీఆర్జీఎఫ్ పథకాన్ని ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. ఇప్పుడు ఆ పథకం కింద ఎలాంటి పనులు జరగడం లేదు. గతంలో కేటాయించిన నిధుల్లో కొన్ని నిధులు మిగిలినప్పటికీ వాటిని ఇతరత్రా పనులకు వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో వాటిని ప్రభుత్వానికి పంపిం చాల్సి వచ్చింది.
ఉద్యోగుల సమస్యల పట్ల స్పందిస్తున్నారా..?
ఉద్యోగులు పూర్తి స్వేచ్ఛగా పని చేసుకునే వీలుంది. వారు ఎలాంటి సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటాను. వారు సమస్యలు లేకుండా పని చేయగలిగినప్పుడే ఫలితాలు నూరు శాతం వస్తాయి.
ఛైర్పర్సన్ సహకారం ఎలా ఉంది..?
ఛైర్పర్సన్ గడిపల్లి కవిత స్నేహపూర్వకంగా మెలుగుతారు. నాతో అన్ని విషయాలు చర్చిస్తా రు. ఎలాంటి సమస్య తలెత్తినా దాన్ని చర్చించి పరిష్కరించుకునేందుకు ప్రాధాన్యం కల్పిస్తారు. అందరం కలిసి మెలసి పని చేయడం వల్లే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతున్నాం.
అదనపు బాధ్యతలు భారం కావట్లేదా..?
ప్రస్తుతం గార్ల ఎంపీడీవోగా, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఇన్ని బాధ్యతలు మోయడం తలకు మించిన భారమే. కానీ ఉన్నతాధికారుల ఆదేశానుసారం నిర్వర్తించక తప్పదు కదా. ఇలాంటి సమయంలోనే మన శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం కలుగుతుంది.