Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంతఖర్చైనా సరే బరిలో నిలవాల్సిందే..
- ఆస్తుల్ని అమ్మి...అప్పుులు చేస్తున్న అభ్యర్థులు
- ప్రతిష్టాత్మకంగా మారిన పంచాయతీ ఎన్నికలు
నవతెలంగాణ-కూసుమంచి
''ఎలాగైనా సరే ఈ ఎన్నికల్లో గెలవాల్సిందే... ఎంత ఖర్చైనా సరే బరిలో నిలవాల్సిందే... ఈ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా గెలిచి తీరాల్సిందే...'' ప్రత్యర్థి వెయ్యి రూపాయలు ఇస్తే... మనం రెండు వేలు ఇచ్చైనా సరే...చక్రం తిప్పాల్సిందే.. ఈ ఎన్నికల్లో వెనక్కి తగ్గేది లేదు. అన్న చందంగా మారాయి ఇది ప్రస్తుత పంచాయతీ ఎన్నికలు. రాజకీయ జీవితంలో తొలి ఘట్టంగా నాయకులు భావించే సర్పంచ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దీంతో పోలింగ్కు మరో రెండు రోజులు మాత్రమే ఉండడంతో పల్లెల్లో రాజకీయ వేడి మరింత మొదలైంది. కూసుమంచి మండలంలో పంచాయతీ పోరుపై కథనం...
రూ.కోట్లు దాటుతున్న ఖర్చు...
అసెంబ్లీ ఎన్నికల్లో చవిచూసిన ధనప్రవాహాన్ని పారించిన అభ్యర్థులు అదే తరహాలో పంచాయతీ ఎన్నికల్లోనూ పోటా పోటీగా తాయిళాల పంపిణీ సాగుతోందన్న చర్చ బహిరంగంగానే వినిపిస్తోంది. గెలవాలనే ఆశతో లక్షలాది రూపాయల్ని ఖర్చుపెట్టేందుకు సిద్ధపడు తున్నారు.గత పంచాయతీ ఎన్నికల్లోనే ఓ అభ్యర్థి అరకోటి దాకా ఖర్చుపెట్టిన దాఖలాలున్నాయి. ఈ సారి అంతకుమించి ఖర్చు పెట్టేందుకు కొన్ని ఊళ్లల్లోనూ అభ్యర్థులు జోరును చూపుతున్నారు. కూసుమంచి మండలంలోని నాలుగైదు పంచా యతీల్లో బరిలో నిలుస్తున్న అభ్యర్థులు ఇప్పటికే డబ్బు పంపిణీ షురూ చేస్తున్నట్టు వినికిడి.
కూసుమంచి మండలంలో మొత్తం 41 పంచాయతీలు, 364 వార్డులు ఉన్నాయి. కాగా వీటిల్లో 3 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 38 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. వీటికి 105 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పాలేరు నియోజకవర్గంలోని ఓ మండల కేంద్రంలో సర్పంచి పదవికి ఊహించని పోటీ నెలకొంది. స్థిరాస్థి వ్యాపారాల్లో ఉన్న వారంతా అక్కడి పీఠంపై కూర్చోవాలనే కుతూహలాన్ని చూపుతున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచే వివిధ వర్గాల మద్దతు కోసం లక్షలాది రూపాయల్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నట్టు వార్తులు వినవస్తున్నాయి. ఇక పోలింగ్ రెండు రోజులే ఉండటంతో గ్రామాల్లో నోట్ల కట్టలను తెంపేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
పంచాయతీల్లో ఓటర్లకు గాలం
పంచాయతీ పోరులో నిలుస్తున్న వారు ఇష్టానుసారంగా డబ్బుల్ని వెదజల్లుతున్నారు. ఓటర్లకు తమ దైన శైలిలో గాలం వేస్తున్నారు. కులసంఘాల వారీగా కొంతమొత్తాన్ని అప్పగి స్తున్నారు. 'ఎలాగైనా సరే.. ఎంతఖర్చైనా సరే' ఎన్నికల్లో గెలవాలనే ఏకైక లక్ష్యంతో మంచినీళ్ల ప్రాయంలా డబ్బుల్ని గుమ్మరిస్తున ా్నరన్న వార్తలు వినవస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజా సమస్యల ప్రస్తావనకు నడుం కడుతామనే విషయాన్ని ఓటర్లకు గుర్తుచేస్తూనే తానే అన్నివిధాల సర్పంచి స్థానానికి అర్హుడననే తీరుని చేతల్లో చూపిస్తున్నారు. ప్రత్యర్థి ఓటుకు వెయ్యిస్తే తాము రెండు వేలు ఇస్తామనేలా దూకుడును చూపిస్తున్నారు. పైసలకు పైసలేనని.. గెలిచాక ఎట్టి పరిస్థితుల్లో అభివద్ధిని విస్మరించమనే భరోసాను పోటీదారులు ఓటర్లకు ఇస్తున్నారు. సంఘాల భవనాల్ని కట్టించడంతో పాటు గెలిస్తే ఆయా వర్గాల్లోని పెద్దలకు వివిధ పదవుల్ని అందించేలా చొరవ చూపుతామనే హామీలను గుప్పిస్తున్నారు. ఇక కొన్ని పంచాయతీల్లో ఇప్పటికే ప్రత్యర్థికన్నా ముందుం డాలనే ఉద్దేశంతో ఓటుకింత మొత్తాన్ని పంపిణీ చేసిన సందర్భాలు న్నాయి. ఎన్నికలు(పోలీంగ్) జరిగే నాటికి ప్రచారంలో మిగతా వారికన్నా ముందుండాలంటే ధనమే పెట్టుబడి అనేలా ప్రలోభాల పర్వానికి తెరతీస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్కడా ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై అధికారులు దృష్టి సారించడంలేదు.
ఆస్తుల్ని అమ్ముతూ.. అప్పుతెస్తూ..
రాజకీయాల్లో రాణించాలంటే ముందుగా కూర్చోవాల్సిన కుర్చీ సర్పంచి పీఠమేనని నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం తమ రాజకీయ భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పదవిని గెలిచేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. చాలా పంచాయతీల్లో పోటీ చేస్తున్న వాళ్లు ఎన్నికల ఖర్చు కోసం తెలిసిన వారితోపాటు బంధుగణం వద్ద విపరీతంగా అప్పులు చేస్తున్నారు. 3 వేల ఓట్లు ఉన్న పంచాయతీల్లో ప్రతి అభ్యర్థికి ఎంతలేదన్నా రూ.30-40లక్షలు ఖర్చు చేయాల్సి రావడం, చిన్న గ్రామ పంచాయితీల్లో సైతం 5 నుంచి 10 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంతో సర్పంచ్ అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ప్రత్యర్థి ముందర తాము ఆర్థికంగా తక్కువగా ఉంటే ఎక్కడ ఓటరుకు దూరమవుతామన్న భయంతో అప్పులు తెచిఓచ మరీ పంచుతున్నట్టు సమాచారం. ఇంకొన్ని పంచాయతీల్లో ఏకంగా ఉన్న కాస్తో కూస్తో స్థిరాస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారు. మంచి తరుణం మించిన దొరకదనే తీరుని ఇంటిల్లిపాదికి తెలియజెప్పుతూ ఓటర్ల మనసును నోటుతో గెలవాలనే తీరుని చూపిస్తున్నారు. ఖర్చుకు వెనుకడుగు వేస్తే వెనుకంజలో ఉంటామనే తీరుని చేతల్లో చూపిస్తున్నారు. మొత్తంమ్మీద ఓటర్ల మనసును గెలిచేందుకు ఒకొక్కక్కరు ఒక్కో తరహాలో ముందుకు సాగుతున్నారు.