Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెనుబల్లి మండలంలో 25 పంచాయతీలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. మొత్తం 33 పంచాయతీలకు గాను 8 ఏకగ్రీవం అయ్యాయి. ఎన్నికలు నిర్వహించిన 25 పంచాయతీల్లో 5 కూటమి, 2 ఇండిపెండెంట్లు గెలుచుకోగా టీఆర్ఎస్ 18 స్థానాలు కైవసం చేసుకుంది. వీఎంబంజరలో మహాకూటమి అభ్యర్థి భూక్య పంతిలి విజయం సాధించారు. బయన్నగూడెం, తుమ్మలపల్లి, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కోమటి శ్రీలేఖ, జోనబోయిన రమణ విజయం సాధించారు. కుప్పెనకుంట, లంకాసాగర్ గ్రామాలకు చెందిన కూటమి సర్పంచ్ అభ్యర్థులు ఆళ్ల అప్పారావు, మందడపు అశోక్ విజయం సాధించారు. ముత్తుగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి తిరుమలశెట్టి నాగదాసు, పెద్దకారాయిగూడెం కూటమి అభ్యర్థి దొడ్డపనేని శ్రీదేవి, పాతకారాయిగూడెం టీఆర్ఎస్ అభ్యర్థి చీకటి చిట్టెమ్మ, కేఎం బంజర టీఆర్ఎస్ అభ్యర్ధి తన్నీరు కృష్ణవేణి, గంగదేవపాడు టీఆర్ఎస్ అభ్యర్ధి కనగాల జయలక్ష్మి, బ్రహ్మాలకుంట టీఆర్ఎస్ అభ్యర్ధి మాలోతు జ్యోతి, కర్రాలపాడు టీఆర్ఎస్ అభ్యర్థి రాయపూడి మల్లయ్య, బ్రహ్మాలకుంట బానోతు వాణి టీఆర్ఎస్, తాళ్లపెంట సూరపరెడ్డి కిరణ్రెడ్డి (టీఆర్ఎస్), చౌడవరం కొట్లపల్లి శంకర్ (టీఆర్ఎస్), ఏడుగట్ల లక్కినేని శ్యామల (టీఆర్ఎస్), రామచందర్రావుబంజర గుగులోతు హైమావతి టీఆర్ఎస్, మందాలపాడు తడికమళ్ల టీఆర్ఎస్, సూరయ్యబంజర తండా ధర్మసోదు విజయ ఇండిపెండెంట్, తెలగవరం నల్లగట్ల నాగమణి టీఆర్ఎస్, గణేష్పాడు గోదా చెన్నారావు ఇండిపెండెంట్, లింగగూడెం పద్దం చిన్నవెంకటేశ్వర్లు టీఆర్ఎస్, పాత అగ్రహారం టీఆర్ఎస్ గుగులోతు లచ్చు, పాత కుప్పెన కుంట మామిడి మైసయ్య సర్పంచ్లుగా గెలుపొందారు.