Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ పథకంతో పల్లెల పరిశుభ్రతపై పెరిగిన అవగాహన
- గ్రామంలో సర్పంచ్లకు వన్నెతెచ్చేలా బృహత్తర కార్యక్రమాలు
- జిల్లా పరిషత్ ఛైర్మన్ లింగాల కమల్రాజ్
నవతెలంగాణ-ఖమ్మంటౌన్
వినూత్న రీతిలో పల్లెల్లో పట్టాలెక్కించిన '30 రోజుల ప్రణాళిక' పథకం సీఎం కేసీఆర్ కార్యదీక్షకు ప్రతిబింబంలా కనిపిస్తోందని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అభిప్రాయపడ్డారు. పల్లెల్లో పారిశుధ్యం, కనీస అవసరాల ను తీర్చే దృష్టితో గతంలో ఏ ప్రభుత్వం ఆలోచిం చలేదని, సీఎం అమ్ములపొదిలోని ఈ పథకం చరిత్రాత్మక మైనదన్నారు. ఆదివారం తనక్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఛైర్మన్ మాట్లాడారు. ఈ 30 రోజుల ప్రణాళిక వల్ల గ్రామాల్లో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులకు సైతం మోక్షం కలుగుతోం దన్నారు. తప్పనిసరిగా వీధుల్లో విద్యుత్ దీపాలు వెలగాలన్న లక్ష్యంతో ఎల్ఈడీ సాంకేతికతతో కూడిన నాణ్యమైన బల్బులు అమర్చడం సాధారణ విషయం కాదన్నారు. గడిచిన 17 రోజులుగా తాను జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొంటు న్నానని చెప్పారు. గ్రామ సర్పంచ్లు, అధికారులు సైతం ఎంతో బాధ్యతాయుతంగా పని చేస్తూ గ్రామాలను అందంగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అలాగే స్మశాన వాటికలకు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్థలాలను ఇస్తున్న పరిస్థితి నెలకొందన్నారు. ప్రధానంగా ఈ పథకంతో పల్లెల్లో పారిశుద్ధ్యం, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ సమస్య, స్మశాన వాటికలు తదితర పెండింగ్ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని వివరించారు. అలాగే వర్షాలు ఊపందుకుని వ్యాధుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో పారిశుద్థ్యంపై స్వచ్ఛంద అవగాహన పెరిగిందన్నారు. హరిత హారం పేరుతో మొక్కల పెంపకంపైన కూడా ప్రజల్లో చైతన్యం వచ్చింద న్నారు. గ్రామా ల్లో సర్పంచ్లు ఈ విధానాన్ని స్పూర్తిగా తీసుకుని వారి కాలపరిమితి ఆసాం తం ఇదే ఒరవడిని కొనసా గిస్తే తప్పనిసరిగా ఆదర్శ సర్పంచ్లుగా మిగిలి పోతారని అభిప్రా యపడ్డారు. గడిచే 13 రోజుల ప్రణాళికా కాలం లో మరింత వేగంగా ముందుకు తీసు కెళ్లేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.
ముదిగొండ : పరిసరాలతో పాటు గ్రామంలో పరిశుభ్రత పాటించాలని జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు ప్రజలకు సూచించారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని ఖానాపురం, న్యూలక్ష్మీపురం గ్రామాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఖానాపురం గ్రామ ప్రాధమిక పాఠశాలను సందర్శించారు. పాఠశాల సమస్యలను హెచ్ఎం రూపను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్ధులకు నోటు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 30రోజుల ప్రణాళికలో గ్రామాలను బాగు చేసుకోవాలన్నారు. ఆయా గ్రామాల్లో 30 రోజుల ప్రణాళికలో అమలు అవుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి ప్రజలతో మాట్లాడారు. ఖానాపురం, న్యూలక్ష్మీపురం పంచాయతీ వార్డు మెంబర్లు, ప్రజలు కలిసి ఈ రెండు పాఠశాలలకు రూ.1.50లక్షల విలువ చేసే 50 బల్లాలను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, ఎంపీపీ సామినేని హరి ప్రసాద్, జెడ్పీటీసీ పసుపులేటి దుర్గ, గ్రామ వైస్ సర్పంచ్ పి.బాబు, ఎంపీటీసీ నానబాల మాధవి, పాఠశాల ఎస్జీటీ కె.రూప, ఉపాధ్యాయులు భాస్కర్రావు, పంచాయతీ కార్యదర్శి రంజిత్ కుమార్, గ్రామ సర్పంచ్లు కొట్టె అపర్ణ, వాకదాని కన్నయ్య, ఆవుల రమ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.