Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
మడుపల్లి గ్రామంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న ఆటల పోటీలు ఆదివారం ముగిశాయి. వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, త్రోబాల్ వంటి పోటీలను జూనియర్ సీనియర్ బాలబాలికల విభాగంలో వేరువేరుగా నిర్వహించారు. ఈ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్ధులకు మధిర ఎంఈవో ప్రభాకర్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో శీలం వెంకటరెడ్డి, పద్మావతి, బూసా కోటేశ్వరరావు, సంక్రాంతి శ్రీనివాస రావు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.
ముదిగొండ : మండల పరిధిలోని బాణాపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. మండల స్థాయి ఆటల పోటీల్లో భాగంగా రెండు రోజుల నుంచి బాణాపురం హైస్కూల్లో ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు బహుమతులు అందించారు. ఈ కార్యక్ర మంలో ఎంఈఓ మద్దినేని నాగేశ్వరరావు, ఎంపీపీ సామి నేని హరి ప్రసాద్, ఎంపీడీఓ డి.శ్రీనివాసరావు, సర్పంచ్ ఆవుల రమ, ఎంపీటీసీ పి.రమాదేవి, బాణా డవలెప్ మెంట్ సొసైటీ చైర్మన్ వట్టికూటి వెంకటేశ్వర్లు, పాండు రంగారావు, ఉపాధ్యాయులు, పీఈటీలు పాల్గొన్నారు.